Rains in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, మన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో వర్షాలు కురుస్తాయని చెప్పింది.జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్ సహా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com