TG : బాండ్ల వేలంతో తెలంగాణ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం

TG : బాండ్ల వేలంతో తెలంగాణ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం
X

ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను వేర్వేరుగా 16 ఏళ్లు, 18 ఏళ్లు, 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. రేపు వీటి వేలం అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. కాగా ఈ ఏడాది జులై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ఈ మంగ‌ళ‌వారం మ‌ళ్లీ రూ.3 వేల రూపాయ‌లు అప్పుడు కోట్ల అప్పు చేసింది. రిజ‌ర్వు బ్యాంకులో నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో బాండ్ల‌ను ప్ర‌భుత్వం విక్రయించి రూ. 3 వేల కోట్ల‌ను స‌మీక‌రించుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి మంగ‌ళ‌వారం అప్పులు చేస్తూ వ‌స్తోంది. తాజాగా తెచ్చిన అప్పుతో అధికారంలోకి వ‌చ్చిన రెండు నెలలు కూడా గ‌డ‌వ‌క ముందే మొత్తం అప్పుడు రూ. 12 వేల కోట్ల‌కు చేరిన‌ట్ల‌యింది.

Tags

Next Story