Gulf Workers : గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా

గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి సీఎస్ శాంతి జీవో జారీ చేసింది. ఈ ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం అడ్వైజరీ కమిటీ నియమించనుంది. ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నది సర్కార్. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యావకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com