YS Jagan : సీఎం జగన్ హాజరు పై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు..!

X
By - TV5 Digital Team |29 March 2022 4:15 PM IST
YS Jagan : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
YS Jagan : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హుజూర్నగర్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కేసును కొట్టివేయాలని క్యాష్ పిటీషన్ వేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్పై అభియోగం ఉంది. దీనిపై విచారణకు హాజరుకావాలని ఇటీవల సీఎం జగన్కు సమన్లు జారీచేసింది ప్రజా ప్రతినిధులు కోర్టు. దీనిపై విచారించిన కోర్టు జగన్ హాజరుపై ఏప్రిల్ 26వ తేదీ వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. హుజూర్నగర్ పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com