Revanth Reddy : ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణది సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం - సీఎం రేవంత్

Revanth Reddy : ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణది సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం - సీఎం రేవంత్
X

ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనది. సాయుధ పోరాటస్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టాం. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్‌మోడల్‌గా ఉన్నాం. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలి. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నాం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తాచాటారు’’ అని సీఎం అన్నారు.

డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. ‘‘రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించాం. సివిల్స్‌ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం’’ అని తెలిపారు

కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేవంత్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పా. ‘‘కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్‌ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తాం. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదు’’ అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ నగరాన్ని గేట్‌వే ఆఫ్‌ వరల్డ్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్‌ అంటేనే ఒక బ్రాండ్‌ అని సీఎం రేవంత్ అన్నారు. ఈ నగరాన్ని గేట్‌వే ఆఫ్‌ వరల్డ్‌గా తీర్చిదిద్దుతాం. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదగాలి. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం. కాలుష్యం లేని నగరంగా మారుస్తున్నాం. మూసీ నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’’ అని తెలిపారు

Tags

Next Story