TG : మళ్లీ పడిపోయిన టెంపరేచర్.. రాత్రి పూట గజగజ

మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట, సాయంకాలం పూట చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు మెదక్ జిల్లాలో నమోదయ్యాయి. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తోంది. అయితే గత 2 రోజులుగా మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు పెట్టుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com