HYDRA : ఓల్డ్ సిటీలో టెన్షన్.. టెన్షన్

ఓల్డ్ సిటీలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. నిన్న పాతబస్తీలోని బండ్ల గూడ పరిధి అక్బర్ నగర్ లోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో 2 వేల గజాల మేర కబ్జాకు గురైన స్థలంలో అక్రమ నిర్మా ణాలను నేలమట్టం చేశారు. మరోసారి తాజాగా చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్ లో ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమించి ని ర్మించిన షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నా రు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెనక్కి వెళ్లిపోవాలని, తమ ఏరియా జోలికి రావొద్దని స్థానికులు పోలీసులతో వాగ్విదానికి దిగారు. జేసీబీలు, హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నా రు. హైడ్రాకు, రంగనాథ్కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు. మరికొందరు జేసీబీ ఎక్కి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిర సనకారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com