Telangana: అతివేగం.. ఇద్దరు మృతికి కారణం

Telangana: అతివేగం.. ఇద్దరు మృతికి కారణం
Telangana: బయటకు వెళ్లిన మనిషికి ఇంటికి వచ్చిందాకా గ్యారెంటీ లేదు.. మనం జాగ్రత్తగా వెళ్లినా వెనుక వచ్చే వాడో, ముందు నుంచి వచ్చేవాడో ఎప్పుడు గుద్దేస్తాడో తెలియని పరిస్థితి..

Telangana: బయటకు వెళ్లిన మనిషికి ఇంటికి వచ్చిందాకా గ్యారెంటీ లేదు.. మనం జాగ్రత్తగా వెళ్లినా వెనుక వచ్చే వాడో, ముందు నుంచి వచ్చేవాడో ఎప్పుడు గుద్దేస్తాడో తెలియని పరిస్థితి.. పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలు కొందరి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో వచ్చిన బైక్‌ అకస్మాత్తుగా కుడివైపునకు తిరిగిన మరో బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. దాన్ని ఢీకొట్టిన తర్వాత ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని కూడా బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మితిమీరిన వేగం మంచిది కాదు. ట్రాఫిక్ నియమాలను అనుసరించి డ్రైవ్ చేయడం ముఖ్యం అని ట్రాఫిక్ పోలీసులు వెల్లడి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story