Harish Rao : వాళ్లకు జాబ్ వచ్చిందన్న సంబురమే లేదు : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇరిగేషన్ శాఖ లో 224 ఏఈ, 199 జేటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, కాంగ్రెస్ వారి జీవితాలతో ఆడుకుంటుంద న్నారు. ‘ కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురం లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం. కొండంత సంతోషంతో హైదరాబాద్కు రావడం, నిరాశతో వెను తిరిగి పోవడం అభ్యర్థుల వంతు అవుతుంది. పెండ్లి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ సీఎంకి, ప్రభుత్వానికి అలవాటు గా మారింది. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతిభ చాటి, ఏఈ, జేటీవో లుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు' అని హరీష్ రావు ట్వీట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com