TG : అతిత్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TG : అతిత్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

అతి త్వరలోనే రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామ ని హామీ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి ని ఆయకట్టుకు విడుదల చేశారు. ఈసం దర్భంగా మంత్రి మాట్లాడుతూ 'ఐదేండ్ల పాటు కచ్చితంగా రైతులకు బోనస్ ఇస్తం. సైంటిస్టులు సూచినట్లుగా తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలు వేస్తే దిగుబడి మంచిగా వచ్చే అవకాశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పనులకు ప్రియారిటీ ఇస్తున్నం. గత ప్రభుత్వం పదేండ్లడ్ల పాటు లక్ష 81 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశారు. కానీ పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కా ళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు చేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలిపోయాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండానే వానాకాలం సీజన్లో స్టేట్ లో రికార్డు స్థాయి లో పంటలు సాగు అయ్యాయి. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న హామీలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేస్తున్నం' అని తెలిపారు.

Tags

Next Story