TG : మూడో విడత రేపే .. రూ.2,00,000 రుణమాఫీ

మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన ఖమ్మంకు బయల్దేరతారు.
రూ.లక్షన్నర వరకు 2 విడతల్లో రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా పలువురికి రుణాలు జమ కాలేదు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆధార్, పాస్బుక్లో పేర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి మాఫీ కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com