Harish Rao : రైతులను గోస పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటే : హరీశ్ రావు

యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని ఫైర్అయ్యారు. రాష్ట్రంలో సన్ ఫ్లవర్ రైతులు పరి స్థితి మరీ దారుణంగా ఉన్నదని వాపోయారు. కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతు న్నదన్నారు. 'రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తా మని ప్రగల్భాలు పలికిన మంత్రి.. రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమా కాకపోవడం శోచనీయం. సన్న వడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా? ఎన్నికల ముందు అబ్బ ద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు, పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారు. అడుగడుగునా ప్రభుత్వ అసమ ర్థత, నిర్లక్ష్యం బయటపడుతోంది అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com