MLA Maganti Gopinath : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రస్తుత పరిస్థితి ఇది

జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఐసీయూలోనే ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం పై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. 48 గంటలు అబ్జర్వేషన్ కొనసాగుతుందని బంధువులు తెలిపారు, అలాగే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్దపెట్టున ఆసుపత్రికి చేరుకుంటున్నారు. హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలు మూఠాగోపాల్, మాధవంరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గోపీనాథ్ ఆరోగ్యం, అందుతున్న చికిత్సపై అడిగి తెలుసుకున్నారు. తనకుడి భుజంలాంటి అనుచరుడిని కోల్పోవడంతో తీవ్ర ఆవేదనకు గోపీనాథ్ గురయ్యారని శాసనసభ్యులు కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. ఈ విషయంలో తమకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారని తెలిపారు.
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ప్రవేశించారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా, 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా. 1988 నుంచి 93వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడుగా, టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అబ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2022లో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వహిస్తూ జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడుగా మూడవసారి విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com