Captain SN Reddy : రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం దేశంలో ఇదే మొదటి సారి : ఎస్ఎన్ రెడ్డి

సాంకేతిక సమస్య వల్లే అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిందని.. ఫ్లైట్ కు ఉన్న రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. 'ఒక ఇంజిన్ ఎర్రర్ వస్తే మరో ఇంజిన్ తో విమానం నడుస్తుంది.. కానీ ఈఘటనలో రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయింది. ఇంధనం అందకపోవడం వల్ల ఒక్కసారిగా కుప్పుకూలి పోయింది. విమాన ప్రమాదాలను మూడు రకాలుగా చూస్తం. 1. పక్షులు ఢీ కొట్టడం,2. ప్రతి కూల వాతావరణం, 3. టెక్నికల్ ఎర్రర్. దేశంలో ఇప్పటివరకు రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం మొదటిసారి. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కెప్టెన్, పైలెట్ ఏం అలర్ట్ ఇచ్చారు తెలుస్తుంది. కెప్టెన్ మే డే అని అలర్ట్ అయితే మాత్రం ఏటీసీకి అందజేశాడు. కానీ రెండు ఇంజిన్లు ఫెయిల్ అయినప్పుడు ఏటీసీ కూడా ఏమీ చేయలేదు. అది కేవలం సిగ్నల్ వ్యవస్థతో పాటు అబ్జర్వేషన్ మాత్రమే చేయగలదు. 787 డ్రీం లైనర్ విమానం అత్యంత పటిష్టమైనది. టెక్నికల్ సమస్యలు తక్కువగా వస్తాయి. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రం 787 డ్రీమ్ లైనర్ కూడా ఫెయిల్ అయింది. గతంలో నేను ఎన్నో ప్రమాదాల నుంచి చాకచక్యంగా తప్పించాను. పైలట్ కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక పక్షి అడ్డుగా వచ్చినప్పుడు ఎలా తప్పించాలో నేర్పించాను. బ్లాక్ బాక్స్ లో కేవలం పైలట్ కో పైలట్ మాత్రమే వాయిస్ రికార్డు అవుతాయి తప్ప ప్రయాణికుల వాయిస్ లు రికార్డ్ అవ్వవు. రెండు రోజులు విచారణ తరువాత అసలు ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com