TRS: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు.. అప్పటినుండి ఇప్పటివరకు..

TRS: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు.. అప్పటినుండి ఇప్పటివరకు..
TRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎనిమిదేళ్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఎనిమిదేళ్లు పూర్తి.

TRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎనిమిదేళ్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఉద్యమ సమయంలో ఫక్తు స్వరాష్ట్ర కాంక్షతో పురుడుపోసుకొని పని చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా ఉద్యమ పార్టీగానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పని చేస్తుందని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. 2014 ఎన్నికల దగ్గర్నుంచి మొన్నటి వరకు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర సాధన కోసం పని చేసిన పార్టీ ఇక మీదట పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆరెస్ కేవలం 63 స్థానాలకె పరిమితం అయింది.

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసే అదృష్టం టీఆర్ఎస్‌నే వరించింది. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చారిత్రకారు. అయితే నాలుగున్నరేళ్లకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఇక 2018లో జరిగిన ఎన్నికలు చాలా భిన్నమైనవి. ప్రతి పక్ష పార్టీలు అన్ని కలిసి కేసీఆర్ మీద టీఆరెస్ ప్రభుత్వ విధానాల మీద చేసిన ఆరోపణలను ఎదురుకొనేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి దాదాపు 88 స్థానాలను కైసవం చేసుకున్నారు.

అయితే అంతకు ముందు జరిగిన ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికల్లో తెలంగాణను తామే ఇచ్చామనే భావాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. దింతో రెండు సార్లు ప్రతిపక్ష పార్టీ పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తెలంగాణ లో తిరుగులేని రాజకీయ పార్టీగా టీఆరెస్ ఏర్పడింది.అయితే తెలంగాణ ఏర్పాటు కు కీలక భూమిక పోషించిన టీఆరెస్ ప్రభుత్వంగా ఏర్పడ్డ మొదటి నాలుగున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో పరిపాలన పైనే దృష్టి సారించారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పాలనంత రాష్ట్ర పునర్నిర్మాణం పైనే దృష్టి సారించిన కేసీఆర్ ముందస్తుకు వెళ్లి మరోసారి అధికారం చేపట్టిన తరువాత.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. 2014 లో వ్యవసాయం , ఇరిగేషన్ మీదనే పూర్తి దృష్టి పెట్టిన రెండో టర్మ్ పూర్తి కాకముందే ముందస్తుకు వెళ్లారు. ఆరునెలల ముందే ఎన్నికలకు వెళ్లడం.. ఆ తరువాత పూర్తిగా రాజకీయ పరమైన అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.

ఎక్కువగా ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లడం రాష్ట్రంలో జరిగిన వివిధ బై ఎలక్షన్స్ లో తాకత్ కు మించి ఖర్చు చేయడం.. ఎలాగైనా గెలవాలన్నా ఉద్దేశ్యం తో ప్రతి పక్షాల ను నిర్వీర్యం చేయడం లాంటి అంశలు పూర్తిగా టీఆరెస్ కు నెగెటివ్ గా మారాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆరెస్ మొదటిసారి ఓటమి ఎదురు చూసింది ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆరెస్ మానియా మొత్తం మారిపోయింది. గత ఏడేళ్ళల్లో ఎప్పుడు లేనంత ఎదురు దెబ్బ టీఆరెస్ పార్టీ తగిలిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ.

ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో చరిత్ర లో ఎప్పుడు లేనంతగా బీజేపీ తన ప్రాబల్యాన్ని చాటుకొనే 48 స్థానాలను గెలుచుకోంది. ఇలా రెండో టర్మ్ పూర్తి కాకముందే టీఆరెస్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ తరువాత దేశ రాజకీయలు సమూల మార్పులు రావాలన్న గళం విప్పారు గులాబీ బాస్. . ధరణి వల్ల ప్రభుత్వనికి తీవ్ర నష్టం ఏర్పడింది. తరువాత రైతు బంధు ,రైతు భీమా, ఆసరా వంటి స్కిం లు పెట్టి టీఆరెస్ ను ప్రజలు నమ్మేలా జాగర్త పడ్డారు. మొదటి నుండి టీఆరెస్ రైతు పక్షపాతి చెప్పుకుంటున్నా .. ఈ మధ్య కాంగ్రెస్ చేపట్టిన రైతు డిక్లరేషన్ తో కొంత అలెర్ట్ అయ్యారు కేసీఆర్.

పాలన పరమైన నిర్ణయాల్లో కొంత మేరకు అభివృద్ధి చేపట్టిన ఘనత టీఆరెస్ కు దక్కుతుంది.అభివృద్ధి,సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఉన్న కరెంటు సంక్షోభాన్ని తట్టుకొని 24 గంటల కరెంటు సరఫరా ఇవ్వగలిగింది. పాత విద్యుత్ ప్రాజెక్టు లు పూర్తి చేసి కొత్తగా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం లో వేగం పెంచింది.భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.పొరుగు రాష్ట్రాలతో నీటి వివాదాలకు స్వస్తి పలికి ఒప్పందాలు చేసుకొంది. దీని కోసం ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టురీ డిజైనింగ్ చేసి కాళేశ్వరంగా మార్చారు.

అనుమతులు సాధించి శరవేగంగా మూడేళ్ళ ల్లోనే పూర్తి చేశారు. గోదావరిపై తల పెట్టిన సీతారామ,దేవాదుల ఫేస్ , పాలమూరు ,రంగారెడ్డి ప్రాజెక్టు ల పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగులో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పనులు పూర్తి చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగిస్తున్నారు.కొద్ది రోజుల్లోనే కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిలో భాగంగా ప్రాజెక్టుల్లో నీళ్ళు నింపి చెరువులలో నిండుకుండలా తలపించేలా చేసింది ప్రభుత్వం.

ఇక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది సర్కార్. మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలోని చెరువుల పూడిక తీత,సుందరీకరణ పనులు చేపట్టారు. 35 వేల కోట్లతో ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ పథకం పూర్తి చేసింది. కంటి వెలుగు కార్యక్రమంతో కోటిన్నర మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి,35 లక్షల మందికి కళ్ళద్దాలు పంపిణీ చేసింది. అదే విదంగా కొత్త రాష్ట్రంలో పాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేలా సంస్కరణలు చేపట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది.

రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడమే కాకుండా, జోనల్ వ్యవస్థను సవరించి జోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులకె 95 శాతం ఉద్యోగాలు దక్కేల తెలంగాణ లో నూతన జోనల్, మల్టీ జోనల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించింది. ఈ ఎనిమిది ఏళ్ళల్లో అనేక కొత్త పథకాలు అమలు చేశారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం అమలు చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు. రైతు బంధుకి సంవత్సరానికి 15,700 కోట్ల తో రైతుల అకౌంట్స్ జమా చేస్తుంది ప్రభుత్వం. రైతులకు 5లక్షల భీమా, రైతు బంధు సమితుల వంటి వినూత్న కార్యక్రమాలతో రైతులకు అండగా నిలిచింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల స్వరూపం మార్చే ప్రణాళికలు రూపొందించారు. కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలతో పంచాయతీ లు, మున్సి పాలిటీ ల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి దేవాలయంను కనీవినీ ఎరుగని రీతిలో పునర్నిర్మాణం చేశారు.

ఇక రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా దాదాపు 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.నూతనంగా ఏర్పడిన తెలంగాణ లో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కొత్త కలెక్టరేట్లు,ఎస్పీకార్యాలయాలు నిర్మాణం చేప డుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లల్లో కార్యాలయాలు పూర్తి అయ్యాయి. అదేవిధంగా నూతన సచివాలయ నిర్మాణాన్ని దాదాపు వెయ్యి కోట్లతో చేపట్టింది ప్రభుత్వం. తెలంగాణలో పర్యటన రంగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పర్యాటక రంగం ప్రజలను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నారు.

సినిమా షూటింగ్స్ కి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా తెలంగాణ లో చేసుకునెలా పర్యాటక రంగం ని అభివృద్ధి చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత కులాల వారిగా ఆత్మగౌరవ భవనాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల కోట్లతో దళిత బంధు లాంటి కార్యక్రమం చేపట్టింది. ఈ ఎనిమిదేళ్ల లోప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టని అనేక అంశాలతో పాటు కార్యక్రమాలను చేపట్టిన దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది.

ఒకటో తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది. అయినా ఎనిమిది సంవత్సరాలతో తెలంగాణ రాష్ట్రం అనుకునంత స్థాయి లో అభివృద్ధి గరిందని చెబుతోంది టిఆర్ఎస్ సర్కారు. ఇక వచ్చే ఏడాది అంతా ఎన్నికల ఇయర్గా గులాబీ పార్టీ భావిస్తుంది . అందుకే పూర్తి స్థాయిలో పరిపాలన పై ఫోకస్ పెట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా టిఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది

Tags

Read MoreRead Less
Next Story