Etela Rajender : కమిషన్ ముందు ఈటల చెప్పిందిదే!

కాళేశ్వరం అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు శుక్రవారం 113వ సాక్షిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందరన్ను కమిషన్ విచారించింది. బీఆర్ కే భవన్ లో జస్టిస్ ఘోష్ విచారణ కార్యాల యంలో జరిగిన ఈ విచారణకు ఇతరులను అనుమతించలేదు. మొదట కమిషన్ ఈటలతో అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేయించింది. బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ, బిల్లుల చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్లు, టెండర్లు తదితర అంశాలపై విచారణ జరిగింది. ఈవిచారణలో జస్టిస్ ఘోష్ కమిషన్ 19 ప్రశ్నలను సందించింది. అనేక ప్రశ్నలకు నాకేమి తెలియదు,అంతా వాళ్ళకే తెలుసు, నిబంధనల మేరకు వచ్చిన దస్త్రాలపై సంతకాలు చేశాను అని చెప్పారు.
మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులను నిర్మించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నా రని కమిషన్ ఈటలను ప్రశ్నించగా సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలు, మంత్రి వర్గ నిర్ణయం మేరకు నిర్మాణాలు జరిగాయని చెప్పారు. కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే ఈ మూడు బ్యారేజీల నిర్మాణాలు కొనసాగించినట్లు తెలిపారు. కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ నిర్మాణం మార్చాల్సి వచ్చిందని తెలిపారు. మహారాష్ట్ర 158 మీటర్ల ఎత్తుకు అంగీకరించలేక పోవడం ప్రధాన కారణంగా మంత్రి వర్గంలో చర్చజరిగిందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com