Kishan Reddy : ఆ ముగ్గురూ సైనిక శక్తిని అవమానిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : ఆ ముగ్గురూ సైనిక శక్తిని అవమానిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

కాంగ్రెస్ నేతలు రాహుల్, వాద్రా, సీఎం రేవంత్ దేశ సైనిక శక్తిని తక్కువ చేసి అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్అయ్యారు. మన ఎంపీలు పార్టీలను పక్కన పెట్టి ఆపరేషన్ Y సిందూర్ ఎందుకు చేయాల్సివచ్చిందో ప్రపంచా నికి చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 'పహల్గాం ఘటనపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశమంతా కోరుకుంది. 28 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలను భస్మం చేశాం. ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని తగిన విధంగా బదులిచ్చారు. ఈఘటనలు ఎవరికీ తెలియకుండా జరగలేదు. దాడులు, ప్రతి దాడులు క్షణక్షణం మీడియాలో వచ్చాయి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. సున్నితమైన అంశాలపై బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం సరికాదు. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని.. రాహుల్, రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏండ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడే మియా మాటలకు.. వత్తాసుగా,చోటే మియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో కవిత ఎపిసోడ్ పై ఎవరూ స్పందించొద్దు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఎవరూ స్పందించవ ద్దని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. 'కవిత ఎందుకు జైలుకు పోయింది. వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి. వాళ్లది డాడీ డాటర్.. సిస్టర్ బ్రదర్ సమస్య. వాళ్ల డ్రామాలో మేం భాగస్వామ్యం కాబోం. బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో.. కేసీఆర్ బయట పెట్టాలి. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం' అని అన్నారు.

Tags

Next Story