Nizamabad District : నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు బాలికలు మిస్సింగ్

X
By - Manikanta |3 Jan 2025 2:15 PM IST
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు బాలికలు ఒకేసారి మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బాలికలు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. సాయంత్రం అయినా.. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com