Telangana : ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Telangana : ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

మార్చి 5 నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సెక్యూరిటీ పటిష్టవంతం చేయాలని ఆయాజిల్లా కలెక్టర్లు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్లను ఆదేశించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మార్చ్ 5 నుండి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహణపై శుక్రవారం సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు పాల్గొన్నారు. క్వశ్చన్ పేపర్లను ఆయా స్ట్రాంగ్ రూమ్లో నుంచి పోలీస్ స్టేషన్లోకి తరలించే ముందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. రిసెప్షన్ సెంటర్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ను విధించాలని తెలిపారు.

విద్యార్థులు, పరీక్షా సిబ్బంది ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతిం చకుండా తనిఖీలు చేసి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరెందుకు టిజిఆర్టిసి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ ద్వారా ఓఆర్ఎస్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు, బ్లైండ్ విద్యార్థులకు స్కైట్ ను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 9, 96,971 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుండి 12 గంటలకు వరకు నిర్వహిస్తామన్నారు. 1532 చీఫ్ అపెండెంట్లను 1532 డిపార్ట్మెంటల్ ఆఫీసర్సన్న 29992 ఇన్ఫిజిరేటర్స్ను, 75 ఫ్లయింగ్ స్క్వాయిడ్స్ న్న 100 సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ హై పవర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం జిల్లాల వారీగా పబ్లిక్ పరీక్షల నిర్వహణపై తీసుకున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్లు వివరించారు.

Tags

Next Story