IAS Officers : 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

X
By - Manikanta |3 Aug 2024 1:00 PM IST
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్కుమార్కు అదనపు బాధ్యతలు కేటాయించారు. అలాగే ఎస్.హరీశ్కు రవాణా, ఆర్అండ్బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్రెడ్డి, మార్క్ఫెడ్ ఎండీగా శ్రీనివాస్రెడ్డి, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్రాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com