Metro Rail : మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీగా విధులు

Metro Rail : మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీగా విధులు
X

ట్రాన్స్‌జెండర్లు తక్కువవారు కాదు, తలెత్తుకుని బ్రతికే వారు అని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల ఫలితంగా ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి..ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి , మీరు ఆత్మగౌరంతో జీవించాలని సీఎం సంకల్పమని మంత్రి అడ్లూరి తెలిపారు. “మీరు సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించాం. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా తలెత్తే భవిష్యత్తు ఏర్పడుతుంది. మీరు ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి” అని మంత్రి ఉద్బోధించారు.

Tags

Next Story