బీజేపీ ముందు ఈటెల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నారు : పల్లా

బీజేపీ ముందు ఈటెల రాజేందర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని రాజకీయ సమాధి కట్టుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈటల రాజేందర్ చట్టవిరుద్ధంగా దేవాలయ భూములు కొన్నారని ఆరోపించారు. ఈటెల కమ్యూనిజం, బహుజన వాదం ఎటుపోయాయని ప్రశ్నించారు. ఈటెల మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు.. ఈటెలను ... కేసీఆర్ సొంత తమ్ముడిలా చూసుకుంటూ కీలక పదవులు కట్టబెట్టారని అన్నారు. ఈటెల ఏనాడైనా పదవి లేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వాన్ని, నేతల్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పల్లా తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. రైతుబంధు, బీమా పథకాలు అమలు చేస్తున్నారా అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com