Road Accident : లారీ, ఆటో ఢీకొని ఇద్దరు స్పాటెడెడ్

X
By - Manikanta |6 Jun 2025 7:00 PM IST
లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని కంబాలపల్లి చౌరస్తా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మామిడిపళ్లను ఆటోలో తీసుకొని ఇద్దరు వ్యక్తులు మార్కెట్కు వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆటో కంబాలపల్లి చౌరస్తా వద్దకు రాగానే లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న సాయికుమార్ (22), అభిషేక్ (13) స్పాట్లోనే మృతిచెందారు. సమాచారం తెలుసు కున్న సదాశివపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com