Telangana : ఢిల్లీకి ఉత్తమ్.. హైకమాండ్ పిలుపు

Telangana : ఢిల్లీకి ఉత్తమ్.. హైకమాండ్ పిలుపు
X

అధిష్ఠానం పిలుపుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో చర్చలు ఆయన కూడా భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు మిగతా మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న కీలకమైన శాఖలను ఎవరెవరికి ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం చర్చలు జరుపుతోంది. మున్సిపల్, హోమ్, విద్యాశాఖలు సైతం ఆయనే చూస్తున్నారు.

Tags

Next Story