Rajiv Gandhi : రాజీవ్ విగ్రహం టచ్ చేస్తే బాగుండదు.. వీహెచ్ వార్నింగ్

X
By - Manikanta |17 Sept 2024 3:00 PM IST
సచివాలయం ముందు పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హన్మంతరావు తీవ్రంగా ఖండించారు. ఒకవేళ రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
దేశాన్ని 21 వ శతాబ్దానికి తీసుకొని పోవటానికి కృషి చేసిన వ్యక్తి రాజీవ్ అనీ, అలాంటి నేత విగ్రహంకూలగొడతాం అని అనటం సరికాదన్నారు వీహెచ్. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పరిస్థితేమిటని బీఆర్ఎస్ నేతలను విహెచ్ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com