Vikarabad Road Accident: వికారాబాద్ మర్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
By - Prasanna |12 Nov 2021 11:46 AM GMT
Vikarabad Road Accident: వికారబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Vikarabad Road Accident: వికారబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కల్కొడ చౌరస్తా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com