CM Revanth Reddy : పదేళ్లు అధికారం మనదే కావాలి: సీఎం రేవంత్

CM Revanth Reddy : పదేళ్లు అధికారం మనదే కావాలి: సీఎం రేవంత్
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం రేవంత్ రెడ్డి, అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. గాంధీభవన్లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని హితవు పలికారు. సమస్యలు ఉంటే తమ వద్దకు తీసుకురావాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని తేల్చిచెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీలో నాయకుల పనితీరే గీటురాయి. గతంలో నేను పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమని కొందర్ని కోరాను. కానీ వారు వెనకడుగు వేశారు. సీనియర్లు, చిన్న చిన్న బాధ్యతలకు మొహం చాటేశారు. కానీ ఆ తర్వాత బాధ్యతలు చేపట్టినవారికి పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు వచ్చాయి అని సీఎం గుర్తుచేశారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములైతే పదవులు వాటంతటవే వస్తాయని రేవంత్ పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అయితే పార్టీ నేతల పనితీరుపైనే ఇది ఆధారపడి ఉందని చెప్పారు. పదేళ్లు కాంగ్రెస్ గ్యారెంటీగా అధికారంలో ఉంటుందన్నారు. గతంలో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ రెండు దఫాలు అధికారంలో ఉన్నాయని, అదే ఆనవాయితీతో కాంగ్రెస్ కూడా రెండు దఫాలు అధికారంలో ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిందేనని, ప్రజలతో మమేకమై పనిచేయాల్సిందేనని చెప్పారు. అలా పనిచేస్తేనే నామినేటెడ్ పదవులు వరిస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని రేవంత్ గుర్తు చేశారు.

Tags

Next Story