TG : సైబర్ మోసాలు పెరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి.. హైకోర్టు సూటి ప్రశ్న

సైబర్ నేరాలు జరుగుతుంటే బ్యాంక్స్ ఏం చేస్తున్నాయని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసాలపై బ్యాంకుల పాత్రపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ఒకే ఖాతాకు ఒక్కరోజులోనే రూ. 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఆరా తీయడంతో పాటు కేరళలోని ఎర్నాకుళం ఎస్బీఐ బ్యాంక్ కీజ్మాడ్ శాఖపై తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది. సైబర్ నేరగాళ్లు అమాయకుల అకౌంట్లనుంచి అంత మొత్తంలో కొల్లగడుతుంటే బ్యాంకు మేనేజర్ ఏం చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా బ్యాంకులో కరెంట్ అకౌంట్స్ తెరిచేందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఆర్బీఐ నిబంధనలను పాటించారో లేదో రెండు వారాల్లో వివరణ బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్ కుమార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో వరవరావుఅనే వ్యక్తి రూ. 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అదే రోజు భారత్ ఎంటర్ ప్రైజెస్ ఖాతాలోకి ఒకే రోజు రూ. 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు చాలా మంది బాధితుల నుంచి 5 కోట్ల రూపాయలు కాజేశారు. అకౌంట్లో డబ్బు డిపాజిట్, విత్ డ్రా విషయంలో బ్యాంకు మేనేజర్ వైఫల్యం చెందారని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com