MLC Kavitha : తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారు : కవిత

MLC Kavitha : తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారు : కవిత
X

బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ కే పరమితమైందని కేటీఆర్ ను ఉద్దేశించి కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తన పై విమర్శలు చేసే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు జరగాలని కానీ అలా జరగలేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే అదానీ గురించి మాట్లాడటం ఏమిటన్నారు. రాష్ట్రానికి తెలంగాణ తల్లి ముఖ్యమా..? అదానీనా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు వస్తే పార్టీగా ఏమీ చేయలేదని అన్నారు. పార్టీలో చర్చ కూడా జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బలహీనమైతే కాంగ్రెస్‌, బీజేపీలకు లాభం చేకూరుతుందన్నారు కవిత. కేసీఆర్‌ ఎలాంటి తప్పు చేయలేదని.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్‌ మాత్రమే తనకు నాయకుడని,నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయనన్నారు.

Tags

Next Story