KTR : మైనార్టీ సబ్ ప్లాన్ ఏమైంది : కేటీఆర్

KTR : మైనార్టీ సబ్ ప్లాన్ ఏమైంది : కేటీఆర్
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మైనార్టీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని ఇచ్చిన హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. 'హామీలను పక్కన పెట్టి మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోంది. మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.మైనార్టీ డిక్లరేషన్ పేరుతో మై నార్టీలకు 4000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ చిచోరా సీఎం. కేసీఆర్ తిరిగి సీఎం కావడానికి ముస్లిం మైనార్టీల మద్దతు ఉండాలి' అని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. 'కేసీఆర్ మైనార్టీ పిల్లలకు గు రుకులాలు ఏర్పాటు చేశారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు పెట్టారు. 250 మైనారిటీ స్కూల్స్ ను మైనార్టీల కోసం కేసీఆర్ ఏర్పాటు చేశారు. 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్స్ కేసీఆర్ మైనార్టీ విద్యార్థులకు ఇచ్చారు. కోకా పేటలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ను 40 కోట్లతో ఏర్పాటు చేశాము. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మైనార్టీ వెల్ఫేర్ కోసం 10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ముస్లిం పేద ఆడబిడ్డల పెళ్లి కోసం షాదీ ముబారక్ ఇచ్చారు. ఇమామ్ లకు ప్రతి నెల రూ. 10 వేలు ఇచ్చాము. తెలంగాణ వచ్చాక ముస్లింల కు డిప్యూటీ సీఎం, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ ఇచ్చాము' అని రాసుకొచ్చారు.

Tags

Next Story