KTR Tweet : సుంకిశాల విజిలెన్స్ రిపోర్టు ఏది? : కేటీఆర్ ట్వీట్

KTR Tweet : సుంకిశాల విజిలెన్స్ రిపోర్టు ఏది? : కేటీఆర్ ట్వీట్
X

సుంకిశాల ఘటనపై విజిలెన్స్ రిపోర్టును ఆర్టీఐ కింద ఇవ్వకుండా తొక్కిపె ట్టడం దారుణం అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధిం చిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. 'మేఘా సంస్థను బ్లాక్ పెట్టాలనే కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచ డానికి ప్రధాన కారణం సీఎం రేవంత్, మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటై నింగ్వాల్ కూలి రూ.80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్ లో పెరుగుతు న్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది. నిర్మాణ లోపం బయటపడు తుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోంది. సమాచారాన్ని దాచడంఅంటే జరిగిన తప్పును ఒప్పుకు న్నట్టే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దు మ్మెత్తిపోసిన రేవంత్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. తన జేబు సంస్థగా మా ర్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారు. బ్లాక్అస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులే టికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ స్కాంకి తెరతీశారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవా లి. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags

Next Story