Bandi Sanjay : కేసీఆర్ కు ఎందుకు నోటీసు ఇవ్వలేదు: బండి సంజయ్

కేసీఆర్ చెప్తేనే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఏసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చినా ఆయనకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్యం ఒప్పందమేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేక మంది జీవితాలను నాశనం చేసిందని చెప్పారు. సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని అన్నారు. అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ తోపాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. అనుమానం పుట్టాకే కేసీఆర్ పుట్టారని, అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలని సంజయ్ డిమాండ్ చేశారు. టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థిత తీసుకొచ్చారని అన్నారు. చివరకు వాట్సాప్ కాల్ సు కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అని అన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించింది బీజేపీ పార్టీయేనని అన్నారు. ఆ పార్టీతో అవగాహన ఉంటే పోరాటాలు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా సీబీఐ విచారణ చేసే అవకాశం లేనందునే ఆగుతున్నామని, లేకుంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లమని సంజయ్ అన్నారు. తనపై కేసీఆర్ సర్కారు కేసులు పెట్టిందని అన్నారు. సీఎంవో అడ్డగా తాము మాట్లాడుకున్న మాటలు విన్న నీచుడు ప్రభాకర్ రావు అని అన్నారు. ప్రభుత్వం ప్రభా కర్ రావుకు రాచమర్యాదలు మానుకోవాలని సూచించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని తాను వంద సార్లు చెప్పానని గుర్తు చేశారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లో ఉన్నతన వద్దకు వచ్చి అరెస్టు చేయించారని అన్నారు. కేసీఆర్ పాలనలో మీడియా సహా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com