Yadadri : వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
By - Vijayanand |24 Feb 2023 6:54 AM GMT
శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మొదటగా స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు వటపత్రశాయి అలంకార సేవలో స్వామివారు ఊరేగారు. మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
మొదటగా స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com