Telangana : 11 జిల్లాలకు ఎల్లో అలెక్ట్

రాష్ట్రంలో రానున్న 3 రోజులపా టు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం వెల్లడించింది. రేపు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జి ల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30, 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వానలు పడుతాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరి హద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది. హైదరాబాద్లో దంచికొట్టిన వాన హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్ష కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com