Telangana : నాడు కొప్పుల.. నేడు అడ్లూరి

Telangana : నాడు కొప్పుల.. నేడు అడ్లూరి
X

తెలంగాణ మంత్రివర్గంలో ధర్మపురి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వరు మంత్రి పదవి వరించింది. ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రిగా ఆయన సుదీర్ఘకాలం సేవలందించగా తాజాగా రేవంత్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్షణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి సత్తా చాటారు. అంతకు ముందు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ అడ్లూరి అపజయాన్ని చవిచూశారు.

Tags

Next Story