Deputy Mayor : కాంగ్రెస్లో చేరడం లేదు.. డిప్యూటీ మేయర్ క్లారిటీ

Deputy Mayor : కాంగ్రెస్లో చేరడం లేదు.. డిప్యూటీ మేయర్ క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను జీహెచ్ ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కొట్టి పారేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి,మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన్ను కలిశామని తెలిపారు. ఇందులో రాజకీయాల ప్రస్తావనే లేదని చెప్పారు.

తాను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు బాబా ఫసీయుద్దీన్ యాదృచ్ఛికంగా అక్కడే ఉన్నారని.. ఇందులో ఆయన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిన్న తన సోదరి కూతురు వివాహానికి వెల్లినందున కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కాలేదని తెలిపారు డిప్యూటీ మేయర్. కాగా ఇటీవల శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో వీరు పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. మోతె శ్రీలత రెడ్డి 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story