Tollywood: డార్లింగ్ ఫ్యాన్స్‌ అలర్ట్‌; జనవరి 6న రానున్న సెకండ్‌ ఎపిసోడ్

Tollywood: డార్లింగ్ ఫ్యాన్స్‌ అలర్ట్‌; జనవరి 6న రానున్న సెకండ్‌ ఎపిసోడ్
జనవరి 6న ప్రభాస్‌ అన్‌ స్టాపబుల్‌ రెండవ ఎపిసోడ్‌; పూనకాలు తెపిస్తున్న ప్రభాస్‌ ప్రోమో

అన్ స్టాపబుల్ లో ప్రభాస్ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్‌ ఎపిసోడ్‌ సృష్టించిన హైప్ ను మరింత పెంచేందుకు ఆహా కొత్త ప్లాన్‌ వేసింది. సెకండ్‌ ఎపిసోడ్‌ ప్రోమోని రిలీజ్‌ అవ్వగా ఇది ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోందట.

ప్రోమోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ సందడి చేశారు. దివంగత నేత, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజును గుర్తు చేస్తూ స్పెషల్ ఏవీ ప్రదర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని షో తరుపున మౌనం పాటించారు. ఈ సందర్భంగా డార్లింగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకుంటూ పెద్దనాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ మాట్లాడుతూ.. 'శత్రువు ఇంటికి వచ్చినా మర్యాద ఇవ్వాలని, తమ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, కోపాలు ఉన్నాఅన్నింటినీ మర్చిపోవాలని' తన పెద్దనాన్న నిత్యం చెప్పేవాడని ప్రభాస్‌ ఎమోషనల్‌ అయ్యాడు. అంతేకాకుండా ఆయనంటే తనకెంతో ఇష్టమని డార్లింగ్‌ కంటతడి పెట్టుకుంటాడు. ఇక కృష్ణం రాజు మరణించినప్పుడు కూడా ఆయన అభిమానులకు సొంతగ్రామంలో భోజనాలు ఏర్పాటు చేయించామని ప్రభాస్‌ తెలిపాడు.

పెద్దనాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు నెలరోజులు ఆయన బాగోగులు చూసుకున్నానని, ప్రతి నిమిషం వైద్యులతో టచ్‌ లో ఉండి మరీ ఆయన ఆరోగ్యం పట్ల కేర్‌ తీసుకున్నానని తెలిపాడు మన డార్లింగ్. అనంతరం అదే విషయం పై బాలయ్య స్పందిస్తూ, తాను షూటింగ్ నిమిత్తం టర్కీలో ఉండడంతో, ఆ క్షణం మిస్ అయ్యానని, కృష్ణంరాజు మరణవార్త తెలియగానే ఏడుపు ఆపుకోలేక పోయానని బాలకృష్ణ బదులిచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story