Kukatpally : పాలు పగిలాయని.. కూకట్ పల్లి పీఎస్ లో కంప్లెంట్

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా దొంగతనాలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఈ సంఘటన కూకట్ పల్లి రత్నదీప్ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. కూకట్ పల్లికి చెందిన రాములు నిన్న సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే టీ కోసం రెండవ ప్యాకెట్ కాచే సరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని బాధితుడు ఇది ఏంటని అడిగితే, స్టోర్ మేనేజర్ బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన రాములు నేరుగా కూకట్ పల్లి పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలా పలుమార్లు రిపీట్ అవ్వడంతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించిన్నట్లు బాధితుడు రాములు చెప్పారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com