Air India Flight : ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే, ఈ లోపాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది.విమానంలో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఈ విమానంలో ఉన్న లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక బృందం దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనితో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వంటి సంస్థలు విమానయాన సంస్థలకు భద్రతా ప్రమాణాలపై అనేక హెచ్చరికలు జారీ చేశాయి. తాజా ఘటనపై కూడా DGCA దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com