Pakistani Jail : పాక్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో గల మాలిర్ జిల్లా జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యారు. నిన్న రాత్రి కరాచీలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జైలు గోడలకు స్వల్పంగా పగుళ్లు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో బ్యారక్ లలో ఉన్న సుమారు వెయ్యి మంది ఖైదీలను బయటికి విడుదల చేయగా.. వారంతా ప్రధాన ద్వారం వద్ద గుమిగూడారు. ఈ గందరగోళ సమయంలో జైలు అధికారుల నుంచి పలువురు ఖైదీలు ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఖైదీ మృతి చెందాడు. అనేక మంది గాయపడ్డారు. ఫ్రాంటి యర్ కార్ప్స్ కు చెందిన ముగ్గురు సిబ్బంది, ఒక జైలు గార్డు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కరాచీలో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో ఖైదీలు బలవంతంగా గేటు తెరిచారు సింధ్ హోం మంత్రి జియాఉల్హాసన్ లంజార్ మాట్లాడుతూ, ఖైదీలు గోడను కాకుండా ప్రధాన ద్వారం గుండా వె ళ్లిపోయారని అన్నారు. గందరగోళం సమయంలో దాదాపు 100 మంది ఖైదీలు ప్రాంగణం నుంచి పారిపోగలిగారు. ప్ర కంపనల కారణంగా ఒక గోడకు పగుళ్లు వచ్చాయని, కానీ దానిని తప్పించుకోవడా నికి ఉపయోగించలేదని అన్నారు. సింధ్ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com