Gaza : గాజాలో రూ.5ల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ రూ.2,300

Gaza : గాజాలో రూ.5ల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ రూ.2,300
X

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏళ్లతరబడి జరుగుతున్న యుద్ధంలో భారత్ లో రూ.5 ఖరీదు చేసే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ను తన కూతురికి ఎంతో ఇష్టమని గాజాలో ఓ తండ్రి రూ.2,342 పెట్టి కొన్న ఘటన పోరులో బాధిత ప్రాంతాల దుర్భిక్ష పరిస్థితిని కళ్లకు కట్టింది. దీనికి సంబంధించి చిన్నారి రఫిఫ్ తండ్రి మొహమ్మద్ జావద్ సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రఫిఫ్ జావద్ ఒడిలో కూర్చొని బిస్కెట్లను తింటోంది. చాలాకాలం వేచి చూసిన తర్వాత రఫిఫ్ కు ఇష్టమైన బిస్కెట్లను ఎట్టకేలకు నేడు దక్కించుకున్నాను. ప్యాకెట్ ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు ఎగబాకినప్పటికీ రఫిఫ్ కు ఇష్టమైనా దాన్ని కాదనలేకపోయాను. అతడి పోస్ట్ చూసిన నెటి జన్లు ముఖ్యంగా భారతీయులు బాధితులకు సాయ పడాలంటూ ప్రభుత్వ అధికారులకు, పార్లే కంపెనీకి ట్యాగ్ చేశారు.

భారత్ పంపించిన బిస్కెట్ ప్యాకెట్లు, తదితర ఆహార పదార్థాలను హమాస్ స్వాధీనం చేసుకొని బ్లాక్ లో అమ్ముకుం టోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాకు సాయంగా వచ్చిన వాటిని పాలకుల అండదండలతో అనేక మంది ఏజెంట్లు, దొంగలు దోచుకొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారనీ.. కేజీ గోధుమ పిండి దాదాపు 500 యూరోలు, చక్కెర దాదాపు 90 యూరోలు పలుకుతోంది అని ఆవేదనగా చెప్పాడు.

Tags

Next Story