Bangladesh Currency : బంగ్లాదేశ్ నోట్లపై నుంచి ముజిబుర్ ఫొటో తొలగింపు

Bangladesh Currency : బంగ్లాదేశ్ నోట్లపై నుంచి ముజిబుర్ ఫొటో తొలగింపు
X

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని ఆ దేశపు కరెన్సీ టాకా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటిచింది. బంగ్లా హసీనా మాజీ ప్రధాని తండ్రి, దేశ వ్య వస్థాపక వ్యక్తులలో ఒకరైన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇమేజ్ లేకుండా నోట్లను ముద్రిస్తోం ది. ఢాకా ట్రిబ్యూన్ ఈ విషయాన్ని తెలిపింది. హసీనాను భారత్కు పారిపోయేలా చేసిన విద్యార్థి నేతృత్వంలోని ఉద్యమం జూలై తిరు గుబాటును గుర్తుచేసే అంశాలను కలిగి ఉన్న కొత్త నోట్లను బంగ్లాదేశ్ బ్యాంక్ ముద్రిస్తున్నట్లు తెలిపింది. 2024 జులై లో జరిగిన తిరుగుబా టులో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థకు వ్యతి రేకంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో షేక్ హసీనా పదవీ వీడి ఇండియా రావాల్సి వచ్చింది. హసీనా ఇండియాకు వచ్చిన ఆరు నెలల తర్వాత బంగ్లా ప్రభుత్వం నోట్లపై షేర్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని తొలగించడం గమనార్హం.

Tags

Next Story