గల్లంతైన జలాంతర్గామిలో బిలియనీర్లు

గల్లంతైన జలాంతర్గామిలో  బిలియనీర్లు
X
గల్లంతైన జలాంతర్గామిలో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. దీనిలో పాక్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌ ఉన్నట్లు గుర్తించారు.

అట్లాంటిక్‌ సముద్రంలోని టైటానిక్‌ మహానౌక శకలాలను వీక్షించేందుకు బయల్దేరి ఆచూకీ గల్లంతైన జలాంతర్గామిలో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. దీనిలో పాక్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌ ఉన్నట్లు గుర్తించారు.ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ కూడా యాత్రికుల్లో ఒకరని తేలింది. వీరితోపాటు యూకే-యూఏఈ బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌, ఫ్రాన్స్‌కు చెందిన పైలట్‌ పౌల్‌ హెన్రీ నార్జియోలెట్‌ కూడా ఉన్నారు.

ఓషన్‌ గేట్‌ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్‌ శకలాల సందర్శన కూడా ఓ భాగం. న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి ఈ యాత్ర మొదలైంది. 400 నాటికల్‌ మైళ్ల దూరంలోని టైటానిక్‌ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. తొలి రెండు గంటల ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత దీనికి సపోర్టింగ్‌ షిప్‌గా వచ్చిన పోలార్‌ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆ మినీ జలాంతర్గామిలో దాదాపు 70 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ఉంది. ఇది శుక్రవారం వరకు అందులోని వారికి సరిపోవచ్చని అంచనావేస్తున్నారు. కానీ, ఈ జలాంతర్గామి సంబంధాలు తెగిపోయిన చోట సముద్రం చాలా లోతుగా ఉంది. ఇదే గాలింపులో అసలైన సవాలు. వాస్తవానికి టైటానిక్‌ శిథిలాలు 13వేల అడుగుల లోతులో ఉన్నాయి.


Tags

Next Story