గాల్వాన్ లోయ ఘటనలో మా సైనికులు ఐదుగురే చనిపోయారు: చైనా
By - shanmukha |25 Sep 2020 7:00 AM GMT
జూన్ 15న భారత్, చైనా సైనికులు మధ్య గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణతో మృతుల సంఖ్య విషయంలో చైనా ఇప్పటివరకూ స్పందించలేదు.
జూన్ 15న భారత్, చైనా సైనికులు మధ్య గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణతో మృతుల సంఖ్య విషయంలో చైనా ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ ఘర్షణలో 15 మంది భారతీయ సైనికులు అమరులు అయ్యారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన చైనా ఈ ఘర్షణలో తమ సైనికులు ఐదుగురు చనిపోయారని తెలిపింది. చైనా చెప్పిన ఈ వివరాలపై భారత్ స్పందన మాత్రం వేరేలా ఉంది. చైనా ఐదు అని చెప్పిందంటే.. నిజం దానికి మూడింతలు ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో భారత్, చైనా యుద్దం విషయంలో, ప్లూ, కరోనా కేసుల విషయంలో చైనా తీరును పరిశీలిస్తే.. డ్రాగన్ ఖచ్చితమైన డేటా ఇవ్వరని తెలిపుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com