Delhi : ఢిల్లీ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్‌...

Delhi : ఢిల్లీ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్‌...
ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు; ప్రమాద సమయంలో స్కూటీపై మరో యువతి; సీసీ టీవీ ఆధారంగా మహిళ గుర్తింపు

ఢిల్లీలో రోడ్డు యాక్సిడెంట్‌ ఘటనలో ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో స్కూటీ పై అంజలితో పాటు మరొకరు ఉన్నట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసుల గుర్తించారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ పూర్తి చేసుకుని స్కూటీ పై తిరిగి వస్తున్న అంజలితో పాటు తన స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు నిర్ధారించారు.

సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఎన్నో విషయాలను గుర్తించారు. హోటల్ దగ్గర బయలుదేరుతున్నప్పుడు తొలుత అంజలి స్నేహితురాలు స్కూటీ నడపగా, కొద్దిదూరం వెళ్లిన తరువాత అంజలి స్కూటీని నడుపుతానని చెప్పడంతో, స్నేహితురాలు వెనక్కు వచ్చికూర్చున్నట్లు అర్ధమవుతోంది. ఇది జరిగిన కొద్దిసేపటికే కారు ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో తనకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రమాదం జరిగినప్పుడు తాను తీవ్ర భయాందోళనలకు లోనయ్యానని, దీంతో భయపడి ఇంటికి వెళ్ళిపోయానని నిధి చెప్పుకొచ్చింది. విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇక ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఐదుగురు మద్యం సేవించి ఉన్నారు. వీరిని విచారించగా.. అంజలి శరీరం కారులో ఇరుక్కున్న విషయాన్ని గుర్తించలేదని తెలిపారు. కొన్ని కిలోమీటర్ల వెళ్లిన తరువాత.. కారుకింద ఏదో పడినట్లు గుర్తించి కారును ఆపిచూసినట్లు చెప్పారు. కారు ఆపి చూడగా మహిళ మృతదేహం ఉందని, వెంటనే మృతదేహాన్ని తొలగించి అక్కడే పడేసి పరారైనట్లు వెల్లడించారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం జరిగేలా చూడమని వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story