Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో

X
By - Manikanta |4 April 2025 11:00 AM IST
ఆగ్నేయాసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నార్త్ హల్మహేరకు 121 కి.మీ. దూరంలో సముద్రంలో 42 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి. 30 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com