బీరూట్ పోర్టులో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం

లెబెనాన్ రాజధానిలో వరుస ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బీరూట్ పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. టైర్లు, ఆయిల్ నిల్వ ఉంచిన గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ఈ మంటలతో దట్టంగా పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల వారు ఉక్కిరిబిక్కిరయ్యారు.
బీరూట్లో ఆగస్టు 4న చోటు చేసుకున్న భయానక పేలుడు ఘటనలో 191 మంది మరణించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి ఆ ప్రాంతాన్ని మృతుల దిబ్బగా మార్చేసింది. నాటి ఘటన బీరూట్ వాసులను నేటికీ పీడ కలలా వేధిస్తోంది. ఆ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా కంపించింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. దీంతో వరుస ప్రమాదాలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com