బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..!

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..!
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని ఢాకా సమీపంలోని రూప్‌గంజ్‌లో ఓ జ్యూస్ తయారీ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..! ఆరు అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 52 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎత్తైన భవనం నుంచి దూకడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయి. ఆ భవనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లు, రసాయనాల కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. గురువారం సాయంత్రమే ఈ ప్రమాదం జరిగినప్పటికీ..మంటల్ని అదుపు చేసేందుకు చాలా సమయం పట్టింది. ఫ్యాక్టరీలో పనిచేసే చాలా మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దాదాపు 44 మందికిపైగా గల్లంతైనట్లు గుర్తించారు..ఘటనా స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story