USA : అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్.. ఉప్పల్ వాసి మృతి

గన్ మిస్ ఫైర్ కావడంతో అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి మృతి చెందారు. జార్జియాలోని అట్లాంటాలో ఈ ఘటన జరిగింది. అక్కడి కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్న పాల్వాయి ఆర్యన్రెడ్డి మృతి చెందాడు. ఆర్యన్ రెడ్డి ది ఉప్పల్లోని ధర్మపురికాలనీ. ఆర్యన్ రెడ్డి గత ఏడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ శబ్దం వచ్చింది. స్నేహితులు వెళ్లి చూసేసరికే అతడి ప్రాణం పోయింది. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందారు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిస్ఫైర్ పేలి ఆర్యన్ మృతి చెంది ఉంటాడని ఆయన తండ్రి సుదర్శన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com