Elon Musk : ఇక బిజినెస్ చూసుకుంటా.. ఎలాన్ మస్క్ ప్రకటన

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇక నుంచి తాను వ్యాపారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డోజ్)కు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే కేటాయిస్తానని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ మొదటి నుంచి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ కు ఆయనకు డోజ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో మిగులు ఉద్యోగుల పేరుతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసే పేరుతో అనేక పథకాలను నిలిపివేశారు. దీంతో ఆయనపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల్లో వచ్చిన ఈ ఆగ్రహం ప్రభావం టెస్లాపై పడింది. అమెరికాలో అనేక నగరాల్లో టెస్లా షో రూమ్స్ పై ప్రజలు దాడులు చేశారు. టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.యూరోపియన్ యూనియన్ విషయంలోనూ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలతో యూరప్ లోనూ టెస్లా బయికాట్ ఉద్యమం చెలరేగింది. దీంతో అక్కడ కూడా టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న టెస్లా చైనా కంపెనీ బీవైడీ కంటే వెనుకబడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com